మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` తరువాత ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై హీరో రామ్చరణ్. నిరంజన్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీలక ఘట్టాల చిత్రీకరిణ పూర్తయింది. రెజీనా, చిరు పాల్గొనగా ఓ స్పెషల్ సాంగ్ని కోకాపేట్లో ఏర్పాటుచేసిన కాలనీ సెట్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు.
ఈ చిత్రంలో 35 టు 40 నిమిషాల నిడివిగల అతిథి పాత్ర వుంది. దాన్ని రామ్చరణ్ చేయబోతున్నారు. ఇటీవల ఆ పాత్రని మహేష్ చేస్తారని వార్తలు వినిపించాయి. తాజాగా ఆ పాత్రని రామ్చరణే చేస్తున్నట్టు ఇటీవల చిరు ఫైనల్గా చెప్పేశారు. `ఆర్ ఆర్ ఆర్` లో నటిస్తున్న రామ్చరణ్ ఈ సినిమా పూర్తయితే గానీ చిరు సినిమాకి డేట్స్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో రామ్చరణ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
`ఆచార్య` అనే టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రాన్నిఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ని పొడిగించడంతో ముందు అనుకున్న సినిమాల షెడ్యూల్స్ మారిపోతున్నాయి. దీంతో రిలీజ్ డేట్లు కూడా మార్చాల్సిన పరిస్థితులు. దీని కారణంగానే `ఆచార్య` రిలీజ్ కూడా మారే అవకాశం వుందని, వచ్చే ఏడాదే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు కానుందని చెబుతున్నారు.