మిర్యాలగూడలో ప్రణయ్ హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . అయితే ఆ విషయంలో ప్రణయ్ ని హత్య చేయించిన అమృత తండ్రి మారుతీరావు పై ఆగ్రహం వ్యక్తం చేయగా తాజాగా జరిగిన సంఘటనతో మిర్యాలగూడ ప్రజలు పిచ్చ షాక్ ఇచ్చారు . ఏకంగా మారుతీరావు కి మద్దతుగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడమే కాకుండా ఏకంగా జిల్లా ఎస్పీ ని కలిసి వినతి పత్రం ఇవ్వడమే కాకుండా ప్రణయ్ విగ్రహం మిర్యాలగూడలో పెడితే సహించేది లేదని , అందుకు మీరు అనుమతి ఇవ్వొద్దని వేడుకున్నారు కూడా . అంతేగాదు జైల్లో ఉన్న మారుతీరావు ని కలిసేలా అనుమతి ఇవ్వాలని కూడా కోరారు అయితే జైలు అధికారులు అందుకు అనుమతి ఇవ్వలేదు కానీ మారుతీరావు తమ్ముడు శ్రవణ్ ని మాత్రం కలిసేలా అనుమతి ఇచ్చారు . దాంతో శ్రవణ్ ని కలిసి మీకు మద్దతుగా మేమున్నాం అంటూ పెద్ద ఎత్తున మిర్యాలగూడ వర్తకులు పాల్గొన్నారు .
ఎస్పీ ని కలిసిన సమయంలో ప్రణయ్ విగ్రహం పెట్టడం వల్ల అనర్దాలకు దారి తీస్తుందని చక్కగా వివరించారు . ప్రణయ్ విగ్రహం పెట్టి ఏ సందేశం ఇవ్వనున్నామో చెప్పారు .
ప్రణయ్ పెద్దగా చదువుకోలేదు
చిన్న వయసులోనే ప్రేమించి అదే నిజమైన ప్రేమ అనుకోవడం
పాఠశాలకు వెళ్లే సమయంలో ప్రేమించి , పెద్దవాళ్ళని ఎదురించి అమ్మాయిని లేపుకుపొమ్మని అందుకు ఈ విగ్రహమే సమాధానం అని చెబుదామా !
ప్రేమించుకున్నంత మాత్రాన పెద్దల అనుమతి లేదా ?
20 ఏళ్ల పాటు అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయిపై తల్లిదండ్రులకు హక్కు లేదా ?
ప్రేమ వివాహాలకు అభ్యంతరం లేదు కానీ ఇలా పెండ్లి చేసుకోవడం వల్ల సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నాం ?
ప్రణయ్ విగ్రహం పెట్టడం వల్ల చదువుకోవాల్సిన పిల్లలు చదువుకోకుండా ప్రేమ అంటూ అమ్మాయిల వెంటపడే దుష్ప్రభావం ఏర్పడుతుంది తప్ప అదనపు ప్రయోజనం అంటూ ఏమి ఉండదు కాబట్టి ప్రణయ్ విగ్రహం పెట్టొద్దు , అందుకు మీరు అనుమతి ఇవ్వొద్దు అంటూ వేడుకున్నారు . అయితే మారుతీరావు కి వ్యతిరేకంగా మొదట్లో ఉన్నారు అంతా కొద్దిరోజులు కాగానే ఇప్పుడు ఏకంగా మారుతీరావు కు మద్దతు ప్రకటించడమే కాకుండా ర్యాలీ తీశారంటే …. ఎస్పీ ని కలిశారంటే ఇదేనేమో మార్పు అంటే !
English Title: Maruthi rao supporters held rally in miryalaguda