Homeటాప్ స్టోరీస్కథ వినకుండానే ఒకే చెప్పేసాను కారణం......వారి ట్రాక్ రికార్డు

కథ వినకుండానే ఒకే చెప్పేసాను కారణం……వారి ట్రాక్ రికార్డు

కథ వినకుండానే ఒకే చెప్పేసాను కారణం......వారి ట్రాక్ రికార్డు
కథ వినకుండానే ఒకే చెప్పేసాను కారణం……వారి ట్రాక్ రికార్డు

మలయాళ నటి ‘మంజు వారియర్’ తన రెండవ ఇన్నింగ్స్ ని చక్కగా చూసుకుంటూ ఆచి తూచి అడుగు వేస్తుంది. ఒడియన్, లూసిఫెర్ సినిమాల ద్వారా మంచి పేరు దక్కించుకున్న ఆమె తమిళంలో మొదటి సారిగా తన కంటే తక్కువ వయస్సు కలిగిన వారు అయిన హీరో ‘ధనుష్’ తో కలిసి ‘అసురన్’ సినిమా చేసింది. అక్టోబర్ 4 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా తమిళంలో పెద్ద ప్రభంజనం సృష్టిస్తుంది.

మొదటి సారి తమిళంలో నటించిన కూడా ఇదివరకే మళయాళ సినిమాలు తమిళంలో డబ్బింగ్ అవ్వటం వలన తమిళ తబీలు మంజు గారి యాక్టింగ్ కి ఫిదా అయ్యారు. అసురన్ సినిమాలో మంజు చేసిన పాత్ర పచయమాల్ అందరిని అలా థియేటర్ లో కూర్చోబెట్టగలిగింది. విజయోత్సవం జరుపుకుంటున్న ఈ అసురన్ సినిమా గురించి మంజు వారియర్ గారిని అడిగితే సినిమా మొదలు కాకముందు జరిగిన పలు ఆసక్తి కరమైన విషయాలని మీడియా వారి ముందు చెప్పుకొచ్చింది.

- Advertisement -

“నన్ను మొదట సంప్రదించిన దర్శకులు ‘వెట్రిమారన్’ గారు మా ఇంటికి వచ్చారు. నేను వారిని మా ఇంటి లోపలికి ఇన్వైట్ చేసి అతిధి మర్యాదలు చేసిన తర్వాత నాతో ఈ అసురన్ సినిమా గురించి చెప్పబోతుండగా నేను అసలు కథ కూడా వినలేదు. ధనుష్ గారు హీరో అనేసరికి వెంటనే ఒకే చెప్పేసాను. ఎందుకంటే ధనుష్-వెట్రి మారన్ కలయినా మీద నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే ఏమి ఆలోచించకుండా వారికి రెమ్యూనరేషన్ లో సమస్య రాకుండా నాకు తగిన విదంగా ఆలోచించకుండా అలా వెంటనే ఒకే చేసాను” అని చెప్పి మీడియా వారందరికీ షాక్ ఇచ్చింది.

ఇప్పుడు ఆ సినిమా రెండు వారాలలోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. ముక్యంగా సినిమా తమిళ విమర్శకులని మెప్పించింది. ఇక ముందు కూడా చేయబోయే తమిళ సినిమా విషయంలో పలు జాగ్రత్తలు తహెసుకుంటా అని చెప్పింది మంజు వారియర్. రజిని కాంత్ – శివ గారి కాంబినేషన్ లో రాబోయే కొత్త సినిమాలో కూడా మంజు వారియర్ ఒకే పాత్ర చేయబోతున్నారు అని అనుకుంటున్నారు తమిళ మీడియా వాళ్ళు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All