కాలం కలిసి రాకపోతే ఏం చేసినా ఫలితం వుండదు. హీరో మంచు విష్ణు పరిస్థితి ఇందుకు అద్దంపడుతోంది. గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూసిన మంచు విష్ణు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ ఐటీ స్కామ్ నేపథ్యంలో కొత్త తరహా టేకింగ్ మేకింగ్లతో `మోగాసాళ్లు` పేరుతో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. సైలెంట్గా సినిమాని పట్టాలెక్కించాడు కూడా. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు.
కాజల్ అగర్వాలల్, బాలీవుడ్ స్టార్ సునీల్శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హాలీవుడ్కు చెందిన జెఫ్రీ గీచిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. హాలీవుడ్ స్టాయిలో ఇండో హాలీవుడ్ చిత్రంగా దీన్ని మలచాలని మంచు విష్ఱు ప్రారంభం నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతా బాగానే వుంది. కీలక ఐటీ ఘట్టాలు మినహా లాస్ ఏంజీల్స్ తో పాటు హైదరాబాద్లో పలు కీలక షెడ్యూల్స్ని పూర్తి చేశాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కథకు కీలకమైన ఐటీ ఆఫీస్ సెట్ని హైదరాబాద్ కూకట్పల్లి సమీపంలో 3.5 కోట్ల బడ్జెట్తో నిర్మించారు.
అయితే కరోనా మహ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమాల షూటింగ్లన్నింటినీ నివధికంగా వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మంచు విష్ణు సినిమా షూటింగ్ని కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని మంచు విష్ణు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ప్రలంతా ప్రభుత్వానికి సహకరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. అయితే కరోనా కారణంగా ఈ చిత్ర బృందానికి భారీగానే నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.