సోషల్ మీడియా వాడకం పెరిగిన దగ్గరి నుంచి సెబ్రిటీలకు సామాన్యులకు మధ్య దూరం తగ్గిపోయింది. ఏది మాట్లాడాలన్నా.. ట్రోల్ చేయాలన్నా క్షణం కూడా పట్టడం లేదు. దీంతో సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందించాలంటే భయపడుతున్నారు. ఎక్కడ తప్పు దొర్లితే నెటిజన్స్ ట్రోల్స్తో తాటతీస్తారేమోనని భయపడుతున్నారు.
అంత భయపడినా అప్పుడప్పుడు నెటిజన్స్కి బుక్కయిపోతున్నారు. మంచు లక్ష్మి తాజాగా నెటిజన్స్కి బుక్కయ్యారు. స్వయంగా సోదరుడు మంచు మనోజ్ బుక్ చేయడంతో మనోజ్ ట్వీట్ వైరల్గా మారింది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో వర్మ వరుస పోస్ట్లతో కాలక్షేపం చేస్తున్నాడు. తాజాగా ఆయనకో సందేహం కలిగిందట.
ఓ టిక్ టాక్ వీడియోపై వర్మకు డౌటొచ్చింది. టిక్ టాక్లో ఓ వీడియోని చూసిన వర్మ దాన్ని సోషల్ మీడియా ట్విట్టర్లో షేక్ చేశాడు. ఓ యువతి తన కూతురికి మిల్క్ తాగమని గ్లాస్ అందిస్తుంటే మిల్క్ ని అలా పలకొద్దని అచ్చం మంచు లక్ష్మిలా చెప్పడం ఆకట్టుకుంటోంది. కరోనా వైరస్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ఈ వీడియోలో వున్న పాప ఎవరిని ఇమిటేట్ చేస్తుందో కాస్త చెప్పండి? అని అడిగాడు. దీనికి వెంటనే స్పందించిన మంచు మనోజ్ `ఇంకెవరు మా లచ్చక్కే.. అమ్మో అయిపోయాను. ఎటూ పారిపోలేము కూడా.. అని ట్వీట్ చేయడం ఆకట్టుకుంటోంది.
Inkyevaru mana Lachakka ❤️❤️ ammo nenu ayipoyanu… etu paripolemu kuda ? https://t.co/aCvY7SB4tP
— MM*??❤️ (@HeroManoj1) March 30, 2020