టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల పరంగా హీరోల మధ్య పోటీవున్నా వ్యక్తిగతంగా మాత్రం వారి మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. ఇది చాలా సందర్భాల్లో బయటపడింది కూడా. రామ్చరణ్ , మహేష్, ఎన్టీఆర్ కలిసి పార్టీలు చేసుకోవడం.. ఒకరి సినిమా హిట్టయితే ఇతర హీరోలకు పార్టీలు ఇవ్వడం ఇటీవల చూశాం. తాజాగా అలాంటి సన్నివేశమే ఒకటి ఇటీవల మెగా, మంచు ఫ్యామిలీ హీరోల మధ్య జరిగింది.
మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి మధ్య మంచి అనుబంధం వున్న విషయం తెలిసిందే. ఆ అనుబంధాన్ని కొనసాగిస్తూ రామ్చరణ్తో కలిసి మంచు వారబ్బాయి మంచు మనోజ్, మంచు లక్ష్మి దివాళీని సెలబ్రేట్ చేసుకోవడం ఆసక్తిగా మారింది. గతంలో మెగాస్టార్ చిరంజీవికి, కలెక్షన్కింగ్ మోహన్బాబుకు మధ్య మనస్పర్ధలు తలెత్తినా అవి సమసిపోవడంతో ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. వారిలాగే వారి పిల్లలు రామ్చరణ్, మంచు లక్ష్మి, మంచు మనోజ్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.
తాజాగా వీరి మధ్య వున్న అనుబంధం మరోసారి బయటపడింది. దీపావళి సెలబ్రేషన్స్కి రామ్చరణ్ని సాదరంగా ఆహ్వానించిన మంచు మనోజ్ , మంచు లక్ష్మి కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Had a great time with my sweetest brother @AlwaysRamCharan and my lovely akka @LakshmiManchu ?
Celebrated the real Festival of Lights with my Bestiessss ❤️❤️❤️❤️#Diwali #Diwali2020 #SeethaRAMaRajuCHARAN#ManojManchu #LakshmiManchu pic.twitter.com/mlXF5ar62L— Manoj Manchu??❤️ (@HeroManoj1) November 17, 2020