మలయాళంలో సంచలనం సృష్టించిన చిత్రం `జల్లికట్టు`. ఇండిపెండెంట్ యాక్షన్ ఫిల్మ్గా రూపొందిన ఈ చిత్రం 2019లో విడుదలైన చిత్రాల్లో చర్చనీయాంశంగా మారి వార్తల్లో నిలిచింది. లిజో జోస్ పెలి
స్సెరీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్న ఈ చిత్రం 2021 ఏడాదికి గానూ ఆస్కార్ బరిలో భారత్ తరుపున ఎంట్రీ సాధించింది.
ఫిల్మ్ మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. భారత్ నుంచి వివిధ భాషలకు చెందిన 27 చిత్రాలు పోటీపడగా అందులో `జల్లికట్టు` ఎంపికైంది.
ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోసే, సాబుమోన్ అబద్బుసామద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించిన ఈ చిత్రం ఫైనల్గా ఆస్కార్ జ్యూరీ షార్ట్ లిస్ట్ చేసిన 15 చిత్రాల్లో మాత్రం స్థానం పొందలేరపోయింది.
దీంతో భారత్ తరుపున ఆస్కార్ బరిలోకి దిగిన `జల్లికట్టు` తొలి రౌండ్లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. గతంలో చాలా చిత్రాలు ఆస్కార్ ఎంట్రీని సాధించినా ప్రిలిమినరీ స్టేజ్లోనే వెనుదిరిగాయి. అయితే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిని `జల్లికట్టు` ఈ స్టేజ్ని కూడా దాటి ముందుకు వెళుతుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా ప్రిలిమినరీ స్టేజ్లోనే `జల్లికట్టు` వెనుదిరగడంతో అంతా నిరాశకు గురవుతున్నారు.