Homeటాప్ స్టోరీస్ఆస్కార్ బ‌రిలో మ‌ల‌యాళం ఫిల్మ్ `జల్లిక‌ట్టు`!

ఆస్కార్ బ‌రిలో మ‌ల‌యాళం ఫిల్మ్ `జల్లిక‌ట్టు`!

ఆస్కార్ బ‌రిలో మ‌ల‌యాళం ఫిల్మ్ `జల్లిక‌ట్టు`!
ఆస్కార్ బ‌రిలో మ‌ల‌యాళం ఫిల్మ్ `జల్లిక‌ట్టు`!

మ‌ల‌యాళ‌ మూవీ `జ‌ల్లిక‌ట్టు` ఆరుదైన అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. భార‌త్ త‌రుపున అంత‌ర్జాతీయ ఉత్త‌మ చిత్రాల విభాగంలో ఆస్కార్ కు ఎంపికైంది. ఈ విష‌యాన్ని  ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.  భార‌త్ నుంచి ఆస్కార్ విభాగానికి  27 లు పోటీప‌డ‌గా అంతులో మల‌యాళ చిత్రం ‘జల్లికట్టు’ ఎంపికయింది.

ఈ సంద‌ర్భంగా  జ్యూరీ బోర్డ్ ,  ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆర్. అహుల్ రావైల్ మాట్లాడుతూ `మ‌నుషుల్లో వుండే స‌హ‌జ‌సిద్ధ‌మైన మాన‌వ‌త్వాన్ని బ‌య‌టికి తీసిన చిత్ర‌మిది.  మనం జంతువులకన్నా అధ్వాన్నంగా ఉన్నాము. మానవ ప్రవృత్తులు జంతువులకన్నా ఘోరంగా ఉన్నాయి. ఈ విష‌యాన్ని ఈ మూవీలో అద్భుతంగా చిత్రీకరించారు. ఇది మనమందరం గర్వించదగ్గ ఫిల్మ్‌. ఈ మూవీలోని భావోద్వేగాలు మనందరినీ (జ్యూరీ) కదిలించాయి` అన్నారు.

- Advertisement -

లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, సబుమోన్ అబ్దుసామద్, శాంతి బాలచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. గ‌త ఏడాది  అక్టోబర్ 4న విడుద‌లై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు కురిపించారు.  2021 ఆస్కార్ అవార్డుల వేడుక‌ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో కాకుండా ఏప్రిల్‌లో జ‌ర‌గ‌బోతోంది. ఏప్రిల్ 25న అవార్డుల వేడుక జ‌ర‌గ‌నుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All