థ్రిల్లర్ సినిమాలతో అడివి శేష్ తనకంటూ స్పెషల్ మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందే సినిమాలో శేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. తెలుగు, హిందీతో పాటు మలయాళంలో కూడా మేజర్ ను విడుదల చేయబోతున్నారు. జులై 2న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి తగ్గట్లుగా ప్రమోషనల్ యాక్టివిటీస్ జరిగాయి కూడా.
ఈరోజు మేజర్ టీమ్ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చింది. తమ చిత్రాన్ని జులై 2న విడుదల చేయబోవట్లేదని తెలిపింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చింది. ఫ్రెష్ విడుదల తేదీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అంది. సోనీ పిక్చర్స్ తో కలిసి మహేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
సాయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శశి కిరణ్ తిక్కా మేజర్ చిత్రానికి డైరెక్టర్. మేజర్ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే రానుంది.
#ReleaseDay of #MajorTheFilm will be my PROUDEST moment.
So Let’s celebrate when times get better. Safer.Maamulga undadhu. I Promise #JaiHind @saieemmanjrekar @sobhitaD @SonyPicsIndia @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @MajorTheFilm#MajorSandeepUnnikrishnan pic.twitter.com/888UYLTZD3
— Adivi Sesh (@AdiviSesh) May 26, 2021