నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఇటీవలే పునః ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఊర మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మిర్యాల రవీందర్రెడ్డి అత్యంత భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. గత ఎనిమిది నెలల విరామం తరువాత ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది.
ముచ్చటగా మూడవసారి బాలయ్య – బోయపాటి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఓ పాత్ర అఘోరా క్యారెక్టర్ అన్నది తెలిసిందే. ఇదిలా వుంటే ఈ మూవీలో ప్రధాన విలన్ ఇంకా ఫైనల్ కాకపోవడంతో బాలయ్యతో పాటు బోయపాటికి ఈ అంశం తలనొప్పిగా మారిందట.
ముందు ఈ పాత్ర కోసం సంజయ్దత్ని అనుకున్నారు. కానీ సంజయ్ భారీ మొత్తం కోట్ చేయడంతో అతని స్థానంలో సోనుసూద్ ని సంప్రదించారు. సోనూ కూడా భారీగా పారితోషికం డిమాండ్ చేశారట. దీంతో అతన్ని పక్కన పెట్టారు. ఓ వీలన్గా హీరో శ్రీకాంత్ ని ఫైనల్ చేసుకున్నా ప్రధాన విలన్ మాత్రం ఇంకా కన్ఫమ్ కాకపోవడంతో హీరో బాలయ్య, దర్శకుడు బోయపాటి తలపట్టుకుంటున్నారట.