ఇప్పటివరకూ ప్యాన్ ఇండియా సినిమాను అటెంప్ట్ చేయని స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే. ఇప్పటికే ప్రభాస్ మూడు ప్యాన్ ఇండియా సినిమాలను విడుదల చేసి మరో నాలుగు ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతో అందరి కంటే చాలా ముందున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఒకేసారి ప్యాన్ ఇండియాను టార్గెట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో, పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమాలతో ప్యాన్ ఇండియా లెవెల్ ను టార్గెట్ చేస్తున్నారు.
ఇక మిగిలింది సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే. ప్రస్తుతం మహేష్ నటిస్తోన్న సర్కారు వారి పాట కేవలం తెలుగులోనే తెరకెక్కుతోంది. అయితే రాజమౌళి చిత్రం కంటే ముందే మహేష్ బాబు ప్యాన్ ఇండియా అటెంప్ట్ చేయనున్నాడట.
సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ పనిచేయనున్నాడు. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియాగా రూపొందిద్దామని త్రివిక్రమ్ సూచిస్తే దానికి మహేష్ సరే అన్నాడట.