Homeగాసిప్స్మహేష్ పూర్తి స్థాయి నిర్మాతగా మారనున్నాడా?

మహేష్ పూర్తి స్థాయి నిర్మాతగా మారనున్నాడా?

మహేష్ పూర్తి స్థాయి నిర్మాతగా మారనున్నాడా?
మహేష్ పూర్తి స్థాయి నిర్మాతగా మారనున్నాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోలలో ముందు వరసలో ఉంటాడు. తన కెరీర్ లో 26 సినిమాలు చేసిన మహేష్ ఇప్పటికే శిఖరాగ్రాన్ని అంటే స్థాయి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను మహేష్ స్థాపించిన విషయం తెల్సిందే. శ్రీమంతుడు చిత్రంతో మొదలైన ఈ నిర్మాణ సంస్థ ప్రయాణం అక్కడి నుండి అప్రతిహితంగా సాగుతోంది. తన సినిమాలకు ఈ నిర్మాణ సంస్థను పార్ట్నర్ గా చేస్తూ వస్తున్నాడు మహేష్. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలకు జిఎంబి సంస్థను పార్ట్నర్ గా చేసాడు. ఇప్పుడు తన తాజా సినిమా సర్కారు వారి పాటకు కూడా జిఎంబి నిర్మాణ భాగస్వామి.

తన సినిమాలకు మాత్రమే కాకుండా వేరే హీరోల చిత్రాల నిర్మాణాలలో భాగం పంచుకోవడం మొదలుపెట్టాడు మహేష్. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న మేజర్ సినిమాను సోనీ సంస్థతో కలిసి ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాడు. ఇకపై నుండి పూర్తి స్థాయిలో యువ హీరోలతో వివిధ భాషల్లో సినిమాలు నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు మహేష్. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, కార్తీ హీరోలుగా సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇవి సెట్ అయితే మున్ముందు మరిన్ని చిత్రాలు పూర్తి స్థాయిలో నిర్మించాలని అనుకుంటున్నాడు. హీరోగా తన ప్రయాణం కొనసాగిస్తూనే నిర్మాతగా బిజీ అవ్వాలనుకుంటున్నాడు. అయితే ఈ చిత్రాలు అన్నీ వేరే నిర్మాణ సంస్థలతో భాగస్వామి తరహాలోనే ఉంటాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All