సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం, స్పైడర్ ప్లాపుల తర్వాత తన ఆలోచనలో, సినిమాల ఎంపికలో చాలా మార్పు చూపించాడు. తన స్ట్రాంగ్ జోనర్ అయిన సాఫ్ట్ రోల్స్ ను ఎంచుకోవడం మొదలుపెట్టాడు. ఈ కోవలోనే భరత్ అనే నేను, మహర్షి చిత్రాలు వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరులో కొంచెం శైలి మార్చినా ఇంకా మహేష్ ఫ్యాన్స్ కోరుకునే పూర్తి స్థాయి పోకిరి లాంటి మాస్ క్యారెక్టర్ పడలేదు. ఆ దిశగా మహేష్ కూడా ప్రయత్నించలేదని చెప్పాలి. అయితే మహేష్ ఇప్పుడు ఒప్పుకున్న సర్కారు వారి పాట అలాంటి సినిమానే అంటున్నారు.
మహేష్ పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్ ఈ సినిమాలో వేస్తాడని సమాచారం. సర్కారు వారి పాట ప్రీ లుక్ లోనే ఈ సినిమా ఎలా ఉంటుందన్నది తేల్చిచెప్పేసాడు పరశురామ్. పూరి జగన్నాథ్ శిష్యుడైన పరశురామ్ తన శైలికి భిన్నంగా సాఫ్ట్ చిత్రాలు, కూల్ ప్రేమకథలు చేస్తూ వచ్చాడు. తాను ఎప్పటినుండో కల కంటున్న టాప్ హీరో సినిమా ఇప్పుడు తన చేతికొచ్చింది. అందుకే చాలా కసిగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడట. ఈ సినిమాలో మహేష్ పాత్ర చిత్రణ, డైలాగ్స్ చాలా కొత్తగా ఉంటాయని, మహేష్ ఫ్యాన్స్ తో పూర్తి స్థాయి విందు ఈ చిత్రంతో దొరకబోతోందన్నది ఇన్సైడ్ ఇండస్ట్రీ టాక్. జులై లేదా ఆగస్ట్ లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశముంది.