Homeటాప్ స్టోరీస్మహేష్ - పరశురామ్ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో

మహేష్ – పరశురామ్ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో

మహేష్ - పరశురామ్ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో
మహేష్ – పరశురామ్ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు ద్వారా సూపర్ డూపర్ హిట్ ను సాధించాక కొన్ని నెలల పాటు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. కెరీర్ లో కావాలని గ్యాప్ తీసుకున్న మహేష్ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసాడు. ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెల్దామనుకున్నాడు కానీ కరోనా కారణంగా ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి. అయితే లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు.

ఇటీవలే మహేష్ బాబు 27వ సినిమా గురించి అధికారికంగా దర్శకుడి నుండే వార్త వచ్చిన సంగతి తెల్సిందే. మహేష్ తో పనిచేయబోతున్నట్లు దర్శకుడు పరశురామ్ ప్రకటించాడు. ఇది తన కల అని అన్నాడు. ఈ సినిమాకు సంబంధించి కీలకమైన అప్డేట్స్ ఇటీవలే బయటకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఒక ఆసక్తికర లవ్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత మహేష్ రొమాంటిక్ బాయ్ గా నటించబోతున్నాడు. మహేష్ ను ఒక మ్యాచుర్డ్ లవ్ స్టోరీలో చూసి చాలా కాలమైంది.

- Advertisement -

ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా, ఉపేంద్ర విలన్ గా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరి వీటిలో నిజమెంతుందో ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు రానుంది. ఇక ఈ సినిమాను సూపర్ స్టార్ పుట్టిన రోజైన మే 31న ప్రారంభిద్దాం అని టీమ్ భావించింది. అయితే మే 29 వరకూ తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతోంది కాబట్టి మే 31కి లాంచ్ ఉండకపోవచ్చని అంటున్నారు. పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All