సూపర్ స్టార్ మహేష్ బాబు దక్షిణ భారతీయ సినిమాల్లో అత్యంత అందమైన వ్యక్తి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన అందానికి ముచ్చటపడని హీరోయిన్ అంటూ లేరంటే అది అతిశయోక్ఇ కాదేమో. లాక్డౌన్ టైమ్లో మహేష్ కలర్ మరింతగా పెరిగింది. ద్విగుణీకృతమైన కాంతితో మహేష్ మెరిసిపోతున్నారు. ఆయన ఫొటోలని చూసిన వాళ్లు ముఖం తిప్పుకోవడానికే ఇష్టపడలేదంటే మన సూపర్స్టార్ ఎంత అందగా మారిపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తాజాగా మహేష్ కు సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేసిన నమ్రత మహేష్ అందాన్ని పొగుడుతూ మైమరిచిపోయి మురిసిపోయింది. తెల్లవారుజామున 3 గంటలకు దుబాయ్ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కడానికి ఎదురు చూస్తున్న మహేష్ ఫోటోను నమ్రతా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. `తెల్లవారుజామున 3 గంటలకు ఎవరు ఇలా కనిపిస్తారు?. ఫ్లైట్ ఎక్కడానికి ఎదరుచూస్తున్న ఓ అందమైన వ్యక్తి మీ ముందు కూర్చున్నప్పుడు సమయమే తెలియదు` అని తన భర్త అందాన్ని ప్రశంసిస్తూ పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫొటో ఇన్స్టాలో వైరల్గా మారింది. మహేష్ ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. త్వరలో అమెరికా వెళ్లబోతున్నారు. అక్కడ ‘సర్కారు వారీ పాట’ షూటింగ్ ప్రారంభించనున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించబోయే ఈ చిత్రంలో కీర్తి శెట్టి కథానాయికగా నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ తో కలిసి జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మింనుంది.
View this post on Instagram