Homeటాప్ స్టోరీస్ఫ్యామిలీతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తున్న మహేష్ బాబు

ఫ్యామిలీతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తున్న మహేష్ బాబు

 

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీ తో కలిసి ఇంగ్లాండ్ లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు . ఈరోజు ఇంగ్లాండ్ లోని ఓవల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ – ఆస్ట్రేలియా ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే . దాంతో ఫారిన్ టూర్ లో ఉన్న మహేష్ తన కుటుంబంతో పాటుగా మహర్షి దర్శకులు వంశీ పైడిపల్లి తో కలిసి మ్యాచ్ తిలకిస్తున్నారు . మ్యాచ్ ప్రారంభానికి ముందు వంశీ పైడిపల్లి తో పాటుగా మహేష్ తన కుటుంబంతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చాడు .

కాగా వాటిని దర్శకుడు వంశీ పైడిపల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు . మహర్షి చిత్రం విడుదల అయ్యాక ఫారిన్ టూర్ ప్లాన్ చేసాడు మహేష్ . గత ఇరవై రోజులుగా వివిధ దేశాలు చుట్టేస్తూ సందడి చేస్తున్నాడు మహేష్ బాబు . అందులో భాగంగానే తాజాగా ఇంగ్లాడ్ లో ఉన్నాడు దాంతో ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం టికెట్స్ బుక్ చేసుకోవడంతో మ్యాచ్ తిలకిస్తున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All