మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా మహర్షి చిత్రం రిలీజ్ డేట్ తాజాగా మారింది . దిల్ రాజు ప్రకటించిన సారాంశం ప్రకారం ఏప్రిల్ 25 న విడుదల అవుతోంది మహర్షి చిత్రం . ఈ చిత్రం గత ఏడాది ఆఖరులో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ కుదరలేదు దాంతో ఈ ఏడాది ప్రథమార్ధంలో అనుకున్నారు అది కూడా కుదరలేదు ఏప్రిల్ 5 అన్నారు కట్ చేస్తే ఇపుడు ఏప్రిల్ 25 కు మారింది రిలీజ్ డేట్ .
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు . ఇక ఈ చిత్రాన్ని ముగ్గురు నిర్మాతలు నిర్మిస్తున్నారు . అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు . తాజాగా దిల్ రాజు మహర్షి సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు కాబట్టి ఏప్రిల్ 25 న రిలీజ్ ఉండొచ్చు . గత ఏడాది భరత్ అనే నేను చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ ఈ ఏడాది మహర్షి తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు .
English Title: Mahesh babu’s Maharshi gets new release date