Homeటాప్ స్టోరీస్సర్కారు వారి పాట లేటెస్ట్ షూటింగ్ అప్డేట్స్ ఇవే

సర్కారు వారి పాట లేటెస్ట్ షూటింగ్ అప్డేట్స్ ఇవే

సర్కారు వారి పాట లేటెస్ట్ షూటింగ్ అప్డేట్స్ ఇవే
సర్కారు వారి పాట లేటెస్ట్ షూటింగ్ అప్డేట్స్ ఇవే

సూపర్  స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న విషయం తెల్సిందే. దుబాయ్ లో షూటింగ్ కోసం ఇస్తోన్న ఆతిధ్యానికి మహేష్ ముగ్దుడయ్యాడు. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసాడు మహేష్.

ఇదిలా ఉంటే సర్కారు వారి పాట కోసం దుబాయ్ లో యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారట. భారీ ఛేజింగ్ సీన్ ను ఇటీవలే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మహేష్ ఇంట్రడక్షన్ షాట్స్ కు ఈ సీన్స్ ను చిత్రీకరించారట. ఇదిలా ఉంటే దుబాయ్ షెడ్యూల్ ను ఈ నెలాఖరు వరకూ కొనసాగిస్తారని తెలుస్తోంది.

- Advertisement -

ఇక సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పరశురామ్ ఈ సినిమాకు దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కలిపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తోన్న విషయం తెల్సిందే. సర్కారు వారి పాటను 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All