సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత కొన్ని నెలల పాటు బ్రేక్ తీసుకుని ఒప్పుకున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. దుబాయ్ లో నెల రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఆగస్ట్ కల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేసి మరో సినిమాను టేకప్ చేయాలని మహేష్ భావించాడు.
అయితే కరోనా మహేష్ ఆశలపై నీళ్లు చల్లింది. ఏదేమైనా సర్కారు వారి పాట చిత్రాన్ని అక్టోబర్ కైనా పూర్తి చేయాలని ప్రస్తుతం భావిస్తున్నాడు మహేష్. ఇప్పటికే ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపుతున్నట్లు అధికారికంగా తెలిపిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్ చిత్రాన్ని బ్రేక్ లేకుండా వెంటనే మొదలుపెట్టి 2022 సమ్మర్ కు విడుదల చేయాలని భావిస్తున్నాడు.
ఈ లెక్కన కేవలం 6 నెలల్లోనే మహేష్ బాబు తన 2 సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నాడు. మరి కరోనా తన ప్లాన్స్ వర్కౌట్ అయ్యేలా చేస్తుందో లేదో చూడాలి.