మహేష్ బాబు ని తీవ్ర ఉత్కంఠ కు గురిచేసింది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ . ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే . అయితే ఆ ఫైనల్ మ్యాచ్ లో రెండు జట్లు కూడా టై కావడంతో సూపర్ ఓవర్ ఆడించారు ఇంకా విచిత్రం ఏంటంటే ఆ సూపర్ ఓవర్ లో కూడా చేరి సమం పరుగులు సాధించడంతో టై అయ్యింది దాంతో ఇంగ్లాండ్ జట్టు రెండు ఫోర్లు కొట్టింది కాబట్టి విశ్వవిజేత గా ప్రకటించారు అంపైర్లు .
ఇంగ్లాండ్ మ్యాచ్ గెలిచి విశ్వవిజేత అయితే న్యూజిలాండ్ మనసులు గెలిచిందని ట్వీట్ చేసాడు మహేష్ బాబు . రెండు సార్లు కూడా టై కావడంతో ఊపిరి బిగబట్టి మరీ చూశాడట మ్యాచ్ ని . అందుకే రెండు జట్లకు అభినందనలు తెలియజేసాడు మహేష్ బాబు . ఇక తాజాగా సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంలో నటిస్తున్నాడు మహేష్ బాబు . ఈ చిత్రాన్ని జనవరి 2020 లో విడుదల చేయనున్నారు . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది .
Still hungover from last night’s match… Most exciting finals ever???
Great cricket!!! England might have won the game but New Zealand surely won hearts. Congratulations to both the sides! ?#CWC19 pic.twitter.com/Kaq6LbKKZj— Mahesh Babu (@urstrulyMahesh) July 15, 2019