టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా పూర్తయ్యాక వివాదాస్పద దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . అయితే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన రెండు చిత్రాలు అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్ ల వల్ల విమర్శలే ఎక్కువగా వచ్చాయి .
ఇక కబీర్ సింగ్ వల్ల అయితే ఇంకా వివాదం ముదురుతూనే ఉంది . మహిళల పట్ల చులకన భావం కలిగిఉన్న దర్శకుడు అని ముద్ర పడింది సందీప్ రెడ్డి వంగా పై . అలాంటి దర్శకుడితో తన తదుపరి చిత్రాన్ని మహేష్ చేయడం వల్ల ఇబ్బందులు తప్పకపోవచ్చు అని అంటున్నారు . మహేష్ బాబు కు క్లీన్ ఇమేజ్ ఉంది అలాంటి మహేష్ సందీప్ తో సినిమా చేస్తే మహిళలను మరోసారి కించపరిచేలా సన్నివేశాలు ఉంటాయా ? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు .