దేశ భక్తి నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఓ భారీ చిత్రాన్ని గతంలో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. దీని కోసం మంచి లైన్ని కూడా సిద్ధం చేసిన పూరి అందు కోసం మహేష్బాబుని హీరోగా కూడా అనుకున్నారు. కానీ `బిజినెస్మెన్` తరువాత మహేష్ స్టైలిష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో కలిసి పనిచేయడానికి అంతగా ఆసక్తిని చూపించలేదు.
ఈ చిత్రానికి `జన గణ మన` అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు. కానీ ఆ తరువాత ఏం జరిగిందో అందరికి తెలిసిందే. పూరి జగన్నాథ్ ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశారు. తాజాగా ఈ సినిమాపై మళ్లీ చర్చ మొదలైంది. పవర్స్టార్ పవన్కల్యాణ్ హీరోగా నటించిన `గబ్బర్సింగ్` చిత్రం ఈ నెల 11తో 8 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు.
ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ని హోరెత్తించిన విషయం తెలిసిందే. పనిలో పనిగా బండ్ల గణేష్ని `జన గణ మన` చిత్రాన్ని చేయమని, అది మీకే సాధ్యమని, ఇందుకు పూరిజగన్నాథ్ని ఒప్పించండని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు. పూరి, మహేష్, బండ్ల గణేష్.. ఈ కాంబినేషన్ మేం ఫిక్సయ్యాం.. మీరూ ఫిక్స్ అవ్వాల్సిందే అంటూ మహేష్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ని డిమాండ్ చేస్తుండటం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Thank you for your wish brother ? https://t.co/cOkJqHlewF
— BANDLA GANESH (@ganeshbandla) May 12, 2020
Credit: Twitter