Homeటాప్ స్టోరీస్కేటీఆర్ ఛాలెంజ్ ని స్వీకరించిన మహేష్ బాబు

కేటీఆర్ ఛాలెంజ్ ని స్వీకరించిన మహేష్ బాబు

mahesh babu accepted ktrs harithaharam challengeహరితహారంలో పాల్గొని మొక్కలు నాటాలని తెలంగాణ ఐటీ శాఖామాత్యులు కేటీఆర్ విసిరిన సవాల్ కు కాస్త ఆలస్యంగానైనా స్పందించాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు . ఎట్టకేలకు నిన్న మహేష్ బాబు తన కూతురు సితార తో కలిసి మొక్కలు నాటి కేటీఆర్ ఛాలెంజ్ ని స్వీకరించినట్లు ప్రకటించాడు . అంతేకాదు హరితహారం కార్యక్రమం చాలా మంచిదని కొనియాడాడు కూడా . మంత్రి కేటీఆర్ ఈ సవాల్ విసిరి వారం కావస్తోంది అయితే కాస్త ఆలస్యంగా స్పందించాడు మహేష్ . సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండడు అందుకే ఈ విషయం పై స్పందించడానికి మొక్కలు నాటడానికి సమయం పట్టింది .

ఇక తన తదుపరి సవాల్ ఎవరికి విసిరాడో తెలుసా …… కూతురు సితార , తనయుడు గౌతమ్ అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లి లకు . హరితహారం లో పాల్గొని మొక్కలు నాటాలని ఆ ముగ్గురికి సవాల్ విసిరాడు మహేష్ , అయితే ఆ ముగ్గురిలో ఇద్దరు తన సంతానం కాబట్టి సితార , గౌతమ్ లచేత మొక్కలు నాటించే బాధ్యత మహేష్ బాబు దే ! ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25 వ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా ముగ్గురు నిర్మాతలు అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .

- Advertisement -

English Title: mahesh babu accepted ktrs harithaharam challenge

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All