టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25 లక్షల విరాళం ప్రకటించాడు . కేరళలో భారీ వర్షాలతో , వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దాంతో ప్రజల కష్టాలను చూసి చలించిపోయిన మహేష్ బాబు తనవంతు సహాయంగా 25 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధి కి అందజేశారు . గతకొంత కాలంగా కేరళలో భారీ వర్షాలతో , వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు , వేలాదిమంది నిరాశ్రయాలయ్యారు . ప్రక్రుతి నిలయంగా ఉన్న కేరళ ప్రకృతి ప్రకోపానికి గురవ్వడంతో దేశమంతా కేరళకు బాసటగా నిలిచింది .
పలువురు హీరోలు , హీరోయిన్ లు , రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధి కి . అందులో భాగంగా మహేష్ 25 లక్షలను ప్రకటించాడు . ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మహేష్ బాబు భారీ విరాళాన్ని ప్రకటించడంతో మహేష్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు హీరో గొప్పతనం గురించి .
English Title: mahesh babu 25 lakhs donates to kerala floods