సంక్రాంతి సమరం యమ రంజుగా సాగబోతోంది. సరిలేరు నీకెవ్వరు`తో మహేష్, `అల వైకుంఠపురములో`తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బరిలోకి దిగుతున్నారు. ఈ రెండు చిత్రాలు దేనికదే ప్రత్యేకతలతో పోటీపడుతున్నాయి. విచిత్రంగా రెండు చిత్రాలు ఎంటర్టైన్మెంటట్నే ప్రధానంగా తీసుకుని బరిలోకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ రెండు చిత్రాల ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతినిచ్చింది.
ఉదయం 7 గంటలకు `సరిలేరు నీకెవ్వరు`, అల వైకుంఠపురములో` చిత్రాల ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ అధికారులు అనుమతినిచ్చారు. మహేష్ నటిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` శనివారం నుంచి ఈ నెల 24 వరకు, బన్నీ నటించిన `అల వైకుంఠపురములో`సినిమాను ఈ నెల 12 నుంచి 25 వరకు ఐదో ఆటకు గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో టిక్కెట్ రేట్లని పెంచేశారు. పెరిగిన టిక్కెట్ రేట్లు వారం రోజుల పాటు కొనసాగుతాయట.
అయితే పెంచిన రేట్లు ఏ స్థాయిలో వుంటాయన్నది మాత్రం ప్రకటించలేదు. మహేష్ చాలా రోజుల తరువాత తనదైన మార్కు ఎంటర్టైన్మెంట్తో `సరిలేరు నీకెవ్వరు`లో ఎంటర్టైన్ చేయబోతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సేమ్ టు సేమ్ అదే తరహా వినోదాన్నిప్రధాన వస్తువుగా తీసుకుని `అల వైకుంఠపురములో`తో సందడికి సిద్ధమవుతున్నారు. ఈ రెండింటిలో ఏది పైచేచి సాధిస్తుందా? అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ప్రారంభ వసూళ్లు ఎలా వుండబోతున్నాయనే చర్చ అప్పుడే మొదలైంది కూడా.