“వర్షం”, “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” లాంటి క్లాసిక్స్ రూపొందించిన క్రియేటివ్ మేకర్ ఎం.ఎస్ రాజు గారు దర్శకత్వం వహిస్తున్న సినిమా “డర్టీహరి.” ఈ సినిమాతో శ్రవణ్ రెడ్డి హీరోగా పరిచయమవుతున్నారు. సిమ్రాన్ కౌర్, రుహనీ ఈ సినిమాలో హీరోయిన్లు గా నటిస్తున్నారు. గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు . షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రీ-రికార్డింగ్ పనులు మొదలయ్యాయి. గతంలో పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు తీసిన ఎమ్మెస్ రాజు గారు గత కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. కానీ ఆయన పిల్లలు సినిమాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు.
తను లాంచ్ చేసిన త్రిష మెయిన్ హీరోయిన్ గా, మరొక ఇద్దరు హీరోయిన్లతో గతంలో ఆయన “రమ్” అనే ఒక ప్రాజెక్టును ప్రకటించారు. “రంభ ఊర్వశి మేనక” అనేది ఆ టైటిల్ యొక్క మీనింగ్. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. సహజంగా కథలమీద మంచి అభిరుచి ఉండటంతోపాటు, స్వయానా రచన వైపు అనుభవం ఉన్న ఎమ్మెస్ రాజు గారు స్వయంగా ఈ సినిమా ద్వారా మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో హిట్ నిర్మాతగా కొనసాగాలని కోరుకుందాం.