మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫెర్ రీమేక్ లో నటించనున్న విషయం తెల్సిందే. ఈ సినిమా విషయంలో నడిచిన బోలెడంత సస్పెన్స్ కు మొత్తానికి తెరపడింది. మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. లూసిఫెర్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే నిన్నటి నుండి లూసిఫెర్ సెట్ వర్క్ పనులు షురూ అయ్యాయి. సురేష్ సెల్వరాఘవన్ ఆధ్వర్యంలో లూసిఫెర్ షూటింగ్ కు సంబంధించి సెట్స్ ను నిర్మించే పని మొదలైంది. సురేష్ సెల్వరాఘవన్ ఆచార్య సెట్స్ ను నిర్మించాడు. ఆ వర్క్ నచ్చడంతో చిరంజీవి తన నెక్స్ట్ సినిమాకు కూడా సురేష్ సెల్వరాఘవన్ కు అవకాశమిచ్చారు. ఆచార్య టెంపుల్ ను అత్యద్భుతంగా నిర్మించాడని సురేష్ కు మంచి పేరొచ్చింది.
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగష్టు నుండి లూసిఫెర్ రీమేక్ షూటింగ్ మొదలవుతుంది.