నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం `లవ్స్టోరీ`. శేఖర్కమ్ముల తెరకెక్కిస్తున్నారు. నారాయణ్ దాస్ కె., నారంగ్, పి. రామ్మోహన్రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం బర్త్డే పోస్టర్ని రిలీజ్ చేసింది. కొత్త తరహా కథతో మృద్యమైన ప్రేమకథగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
నటనకు ఆస్కారమున్న పాత్రలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్న సాయి పల్లవి ఈ చిత్రంలోనూ తనదైన శైలిలో సాగే పాత్రలో కనిపించనుంది. తెలంగాణలోని ఓ గ్రామం నుంచి సిటీకి వచ్చే ఓ యువ జంట ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. కథానాయికగా తొలి చిత్రంతోనే ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకుంది సాయి పల్లవి. ఈ చిత్రంలోనూ ఆమె పాత్ర ప్రత్యేకతని కలిగి వుంటుందని చిత్ర బృందం చెబుతోంది.
ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తగ్గని స్థాయిలో సినిమా వుంటుందని, ఇప్పటికి విడుదలైన ఫస్ట్ లుక్, ఏయ్ పిల్లా సాంగ్కు మంచి ఆదరణ లభిచిందని, మరో 15 రోజులు చిత్రీకరణ బ్యాలెన్స్గా వుందని, లాక్డౌన్ తరువాత పరిణామాలని బట్టి మిగతా షూటింగ్ని పూర్తి చేస్తామని, ఈ సినిమాతో శేఖర్ కమ్ముల మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారని చిత్ర బృందం వెల్లడించింది.