Homeటాప్ స్టోరీస్“లాక్డ్ అప్ విత్ సన్నీ” – మేడం అస్సలు తగ్గట్లేదుగా...!

“లాక్డ్ అప్ విత్ సన్నీ” – మేడం అస్సలు తగ్గట్లేదుగా…!

“లాక్డ్ అప్ విత్ సన్నీ” – మేడం అస్సలు తగ్గట్లేదుగా...!
“లాక్డ్ అప్ విత్ సన్నీ” – మేడం అస్సలు తగ్గట్లేదుగా…!

కరోనా వైరస్ వ్యాప్తిని భారతదేశంలో అరికట్టడానికి మొదట ఈ నెల 14వ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ లాక్ డౌన్ ను ఈనెల అనగా ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించారు. అత్యవసర సేవలు మరియు వైద్య సేవలు మినహా ప్రజలందరూ తమ పనులు మానుకొని ఇంటివద్దే ఉంటున్న కారణంగా ఎక్కువగా సోషల్ మీడియా పై వినోదం కోసం ఆధార పడుతున్నారు. ఇక సినిమాలలో మనల్ని ఎంటర్టైన్ చేసే తారలందరూ తమ సోషల్ మీడియా ద్వారా అటు కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూనే.. అప్పుడప్పుడు లైవ్ లోకి వచ్చిన అభిమానులతో నేరుగా మాట్లాడుతూ సందడి చేస్తున్నారు. మరి కొంతమంది తాము ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఇస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందరూ ఏకపక్షంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిక్లేర్ చేసిన ఈ లాక్ డౌన్ ను ప్రజలందరూ పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజిక దూరం పాటించాలని, అత్యవసరమైన పని ఉంటే తప్ప ఇంటి నుంచి బయటకు ఎవరు రావద్దని.. విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ అందాల భామ సన్నీలియోన్ కూడా ఈ రోజు ఆదివారం సందర్భంగా మధ్యాహ్నం 2:30 కు తన ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ లో కి వస్తానని అభిమానులతో ఎన్నో విషయాలు పంచుకుంటానని తాజాగా పోస్ట్ విడుదల చేశారు. ఇక మరొక సోషల్ మీడియా సెలబ్రిటీ అయినా దివ్య అగర్వాల్ కలిసి తాను ఈ లైవ్ పాల్గొంటాను.! అని ప్రేక్షకులకు తెలియజేశారు సన్నీలియోన్.

- Advertisement -

కరోనా వైరస్ పై అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలందరూ ఈస్టర్ పండుగ తన ఇంటివద్దే సురక్షితంగా జరుపుకోవాలని కూడా సన్నీలియోన్ ప్రజలను కోరారు.ఈ సిరీస్ కి ఆమె “లాక్డ్ అప్ విత్ సన్న” టైటిల్ కూడా క్రియేట్ చేశారు. ఇప్పటికే ఆమె సోషల్ మీడియా సెలబ్రిటీలు, నటీనటులతో ఈ సిరీస్ చేస్తున్నారు. ఇక రేపు అనగా సోమవారం ఏప్రిల్ 13వ తేదీ కూడా మద్యాహ్నం 2:30 గంటలకు బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ తో కలిసి లైవ్ కి వస్తానని కూడా సన్నీ ఇప్పటికే అప్ డేట్ ఇచ్చారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All