వెండితెరపై హారర్ థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారారు రాఘవ లారెన్స్. ఇదిలా వుంటే సినిమాల్లో వచ్చిన మొత్తంతో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అనాధల్ని చేరదీసి వారికి ఓ ఆశ్రమాన్ని నిర్మించి అండగా నిలుస్తున్నారు. ఇటీవల కొంత మంది పిల్లలకు గుండు సంబంధిత శస్త్ర చికిత్సలు చేయించారు కూడా. తాజాగా కరోనా కారణంగా పనిలేకుండా పోయిన సినీ కార్మికులకు తన వంతు ఆర్థిక సహాయాన్ని ప్రకటించడమే కాకుండా తన ఇంటికి సమీపంలో వున్న పేదవారికి నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయాన్ని చేసి లారెన్స్ వార్తల్లో నిలిచారు.
తాజాగా ఓ పాత్రికేయుడికి అండగా నిలిచి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్కు విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా మారింది. అశోక్ అనే ఓ పాత్రికేయుడి తల్లి అనారోగ్యం కారణంగా కేరళ తిరువనంతపురంలోని ఎన్ ఐఎంఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అయితే ఆమె మృత దేహాన్ని తమిళనాడు తరలించడానికి సహకరించాలని, ఆమె ఆసుప్తరి ఖర్చులు 1. 50 లక్షలు పాత్రికేయుడు ప్రస్తుతం చెల్లించలేని స్థితిలో వున్నాడని, ఆ మొత్తాన్ని తారు ఒకటి రెండు రోజుల్లో చెల్లిస్తానని కేరళ ముఖ్యమంత్రిని కోరారు లారెన్స్.
దీంతో నెటిజన్స్ లారెన్స్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లారెన్స్ తన గొప్ప మనసును చాటుకుంటున్నారని, పేదలకు అండగా నిలుస్తున్నారని అతన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ అభినందిస్తున్నారు.