తొలి చిత్రం `ఉప్పెన`లో తన ప్రదర్శనతో బేబమ్మ గా కృతి శెట్టి పూర్తి మార్కులు కొట్టేసి అందరి దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు, హీరో వైష్ణవ్ తేజ్ కు ప్రేక్షకుల నుంచి అభినందనలు, జేజేలు లభించగా, కిర్తి శెట్టికి ప్రతిచోటా ప్రశంసలు లభించాయి. అందమైన రూపం అందకు మించిన ప్రతిభ కృతిశెట్టిని అన్ని వర్గాలకు చేరువ చేసింది.
కృతి శెట్టి తన తదుపరి సినిమాలో సుధీర్ బాబుతో కలిసి హైదరాబాద్ కు చెందిన అమ్మాయిగా కనిపించబోతోంది. ఈ చిత్రానికి `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పలి` అనే టైటిల్ని ఖరారు చేశారు.ఈ ప్రేమకథలో సుధీర్ బాబుతో జోడీ కడుతోంది. ఈ చిత్రంలో కృతి శెట్టి తెలంగాణ యాసలో మాట్లాడనుందట. ఇందు కోసం తెలంగాణ యాక్సెంట్ని నేర్చుకుంటున్నట్టు చెబుతున్నారు.
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించబోయే ఈ చిత్రం ఈ సోమవారమే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. బేబమ్మగా ఆకట్టుకున్న కృథిశెట్టి తెలంగాణ యువతిగా ఏ స్థాయిలో ఆకట్టుకోనుందో చూడాలి.