`ఉప్పెన` చిత్రంతో రాత్రికి రాత్రి స్టార్గా మారిన హీరోయిన్ కృతిశెట్టి. కర్ణాటకలోని మంగళూర్లోని కన్నడ ఫ్యామిలీలో పుట్టిన ఈ కన్నడ సోయగం పెరిగిందంతా ముంబై లోనే. ప్రస్తుతం ఓపెన్ యూనిర్శిటీలో సైకాలజీ చేస్తున్న కృతిశెట్టి ప్రసత్తుం టాలీవుడ్లో హాట్ ఫేవరేట్. తొలి చిత్రంతోనే సంచలనం సృష్టించిన ఈ చిన్నది
బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కాలేజీ గర్ల్ బేబమ్మ పాత్రలో కృతి తన అందమైన లుక్స్, అంతకు మించిన నటనతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని తన మాయలో పడేసింది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో కలిసి `శ్యామ్ సింఘరాయ్` చిత్రంలో నటిస్తున్న కృతికి టాలీవుడ్తో పాటు కోలీవుడ్లో కూడా ప్రసిద్ధ బ్యానర్ల నుండి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.
వరుస ఆఫర్ల కారణంగా కృతి తన పారితోషికాన్నిభారీగా పెంచినట్లు చెబుతున్నారు. 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తోంది. నానితో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ దర్శకత్వం వహించనున్నారు. `విరాట పర్వం` నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్లో నిర్మించబోతున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన `ఉప్పెన` రూ .50 కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తోంది.