రెబల్స్టార్ కృష్ణంరాజు సోమవారం తన 80వ పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ఆయన కుటుంబం సభ్యులు ప్రత్యేకంగా ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ తారలంతా హాజరై హంగామా చేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ అండ్ వైట్ కుర్తాలో కొత్తగా కనిపించి పార్టీకి స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు.
ఈ కార్యక్రమంలో ప్రభాస్తో పాటు మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్కింగ్ మోహన్బాబు, మంచు లక్ష్మి, బి.గోపాల్, మంచు విష్ణు, సంగీత దర్శకుడు కోటితో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కృష్ణంరాజుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పార్టీలో హాజరైన ప్రతీ ఒక్కరిని ప్రభాస్ ఆప్యాయంగా పలకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరంజీవి, మోహన్బాబుతో ప్రభాస్ కలిసిపోయిన తీరు ఆక్కడున్న వారిని ఆకట్టుకుంది.
ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రానికి కృష్ణంరాజు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. గోపీకృష్ణమూవీస్, యువీ క్రియేషన్స్ `జాన్` పేరుతో రూపొందుతున్న చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రమిది. రాధాకృష్ణకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే.