కరోనా కారణంగా సినిమాల రిలీజ్లు చాలా వరకు ఆగిపోయాయి. మార్చిలో రిలీజ్ కావాల్సిన క్రేజీ చిత్రాలు వి, నిశ్శబ్దం, ఓరేయ్ బుజ్జిగా, రెడ్.. వంటివి రిలీజ్లు వాయిదా పడ్డాయి. అయితే ఈ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్లో రిలీజ్ కాబోతున్నాయంటూ ప్రచారం మొదలైంది. భారీ ఆఫర్లు ఇస్తున్నారంటూ వరుస కథనాలు వినిపిస్తున్నాయి.
వీటిలో కొన్ని చిత్రాలకి భారీ స్థాయిలో ఓటీటీ కంపెనీలు ఆఫర్లు చేసినా సదరు చిత్రాల నిర్మాతలు అంగీకరించడం లేదని, నేరుగా థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయాలనే పట్టుదలతో వున్నాట్టు నిర్మాతలు
ప్రకటించారు కూడా. ఇప్పటికీ కొన్ని నిర్మాణ సంస్థలతో డిజిటల్ ప్లాట్ ఫామ్స్కు సంంధించి చర్చలు ఇంకా కొనసాగుతున్నాయిని, లాక్డౌన్ తరువాత పరిస్థితులు, ప్రభుత్వ అనుమతులని బట్టి థివయేటర్లో రిలీజ్ చేయాలా? లేక ఓటీటీకే మొగ్గు చూపాలా అనే ఆలోచనకు నిర్మాతలు రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే మరో చిన్న సినిమాకు ఓటీటీ కంపెనీ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. `క్షణం` ఫేం రవికాంత్ పేరేపు కొంత విరామం తరువాత తెరకెక్కించిన చిత్రం `కృష్ణ అండ్ హిస్ లీలా`. సరికొత్త లవ్స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్ ఇచ్చిందని తెలిసింది. అయితే మేకర్స్ మాత్రం థియేటర్ రిలీజ్కి వెళ్లాలా? లేక ఓటీటీకే ఇచ్చేయాలా? అనే డైలమాలో వున్నట్టు తెలుస్తోంది.