Homeగాసిప్స్క్రిష్‌కు ర‌కుల్ భ‌యం ప‌ట్టుకుందా?

క్రిష్‌కు ర‌కుల్ భ‌యం ప‌ట్టుకుందా?

క్రిష్‌కు ర‌కుల్ భ‌యం ప‌ట్టుకుందా?
క్రిష్‌కు ర‌కుల్ భ‌యం ప‌ట్టుకుందా?

ప‌వ‌న్‌తో పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు క్రిష్ లాక్‌డౌన్ కార‌ణంగా ఆ మూవీ షూటింగ్‌ని తాత్కాలికంగా నిలిపివేసిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ పునః ప్రారంభించ‌డానికి మూడు నెల‌ల స‌మ‌యం వుండ‌టంతో ఆ టైమ్‌లో చిన్న చిత్రాన్ని ప‌ట్టాలెక్కించారు. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా క్రిష్ ఇటీవ‌ల ఓ చిత్రాన్ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇందులోహీరోయిన్‌గా న‌టిస్తోంది.

`కొండ పొలం` అనే న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. కేవ‌లం 40 ప‌నిదినాల్లో మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో ఈ చిత్రాన్ని ఫినిష్ చేయాల‌ని క్రిష్ ప‌క్కా ప్లాన్‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ వికారాబాద్ అడ‌వుల్లో జ‌రుగుతోంది. వ‌చ్చే ఏడాది ప‌వ‌న్ పిరియాడిక్ ఫిల్మ్‌ని ప‌ట్టాలెక్కించాలి. అంటే అనుకున్న టైమ్‌లో వైష్ణ‌వ్ తేజ్ చిత్రాన్ని పూర్తి చేయాలి.

- Advertisement -

ఈ మూవీ ప్రారంభం అయిన ద‌గ్గ‌రి నుంచి ద‌ర్శ‌కుడు క్రిష్ వ‌రుస స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటున్నారు. ముందు వ‌ర్షాలు, ఆ త‌రువాత టీమ్‌లోని కీల‌క వ్య‌క్తుల‌కు క‌కోనా అంటూ వార్త‌లు రావ‌డంతో ఇబ్బందులు ఎదుర‌య్యాయి. తాజాగా ర‌కుల్ బాలీవుడ్ డ్ర‌గ్స్ వివాదంలో ఇరుక్కోవ‌డంతో క్రిష్ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌.
ఎన్సీబీ స‌మ‌న్లు అందుకున్న ర‌కుల్‌ ఈ శుక్ర‌వారం విచార‌ణ‌కు హాజ‌రు కాబోతోంది.  ఈ నేప‌థ్యంలో ఎన్సీబీ అధికారుల నిర్ణ‌యం ఎలా వుంటుందో అని క్రిష్ భ‌య‌ప‌డుతున్నార‌ట‌. ఒక వేళ విన‌కూడ‌ని వార్త వింటే ర‌కుల్ కార‌ణంగా ఈ మూవీ షూటింగ్ మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌న్న‌ది క్రిష్ భ‌యంగా తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All