దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందుకున్న హిట్లలలో అత్యధిక శాతం తన వల్లే వచ్చాయని ధీమాగా ఓపెన్గా చెప్పిన ఏకైక సంగీత దర్శకుడు కీరవాణి. `బాహుబలి` తరువాత కూడా సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారాయన. కొంత మంది హిట్టు వల్ల వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే కీరవాణి అలా మాట్లాడారని కొంత మంది కొట్టి పారేశారు. కొంత మంది మాత్రం ఆ మాత్రం ఆయన మాట్లాడకపోతే ఎలా అని అన్న వాళ్లూ వున్నారు.
ఆ తరువాత కూడా వార్తల్లో నిలిచిన కీరవాణి తాజాగా `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ అప్డేట్తో పాటు క్రిష్ మూవీకి సంబంధించిన అప్డేట్ని అందించారు. కానీ పవన్ సినిమాకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కరోనా నుంచి బయటపడిన కీరవాణి, అయన తనయుడు కాలభైరవ కిమ్స్ ఆసుపత్రిలో రెండవ సారి ప్లాస్మా దానం చేశారు. ఈ విషయాన్ని కీరవాణి స్వయంగా సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తను `ఆర్ ఆర్ ఆర్`తో పాటు రెండు కొత్త చిత్రాలకు పని చేస్తున్నట్టు వెల్లడించారు. అందులో ఒకటి క్రిష్ సొంత నిర్మాణ సంస్థ వైష్ణవ్ తేజ్తో నిర్మిస్తున్న చిత్రం కాగా, మరొకటి కె. రాఘవేంద్రరావు నిర్మించే సినిమా అని వెల్లడించారు. అయితే ఇందులో పవన్కల్యాణ్ – క్రిష్ ల కలయికలో సెట్స్పై వున్న చిత్రాన్ని ప్రస్థావించకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొఘల్ సామ్రాజ్యం నాటి కోహినూర్ వజ్రం నేపథ్యంలో క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఈ చిత్రాన్ని ప్రస్తావించకపోవడం ఆసక్తికరంగా మారింది. కీరవాణి పవన్ సినిమా ఆలస్యం అవుతుంది కాబట్టే దాని గురించి వెల్లడించలేదా? లేక ఆయన పవన్ చిత్రాన్ని మర్చిపోయారా అని ఫిల్హ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.