బాలకృష్ణ హీరోగా `గౌతమి పుత్ర శాతకర్ణి` చిత్రాన్ని అత్యంత తక్కువ రోజుల్లో పూర్తి చేసి మిగతా దర్శకులు అవాక్కయ్యేలా చేశారు క్రిష్. క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారాయన. అదే ఫార్ములాను పవన్స్టార్ పవన్కల్యాణ్ చిత్రానికి కూడా అప్లై చేస్తున్నారు. తెలంగాణ రీజియన్లో రాబిన్ హుడ్గా పేరున్న పండుగల సాయన్న కథని ఈ సినిమా ద్వారా తెరపైకి తీసుకొస్తున్నారు. పిరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెర కెక్కిస్తున్నారు.
మణికర్ణిక క్రెడిట్ని కంగన రనౌత్ కొట్టేయడం, ఎన్టీఆర్ బయెపిక్ ఫ్లాప్ కావడం వంటి కారణాలతో విసిగిపోయిన క్రిష్ తాజా చిత్రంతో అన్నింటికీ సమాధానం చెప్పాలని కసితో ఈ చిత్రాన్ని రాజీఅనే మాటే వినిపించకుండా ప్రతీ విషయంలోనే జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇటీవలే ఈ చిత్రాన్ని అల్యూమినియం ఫ్యాక్టరీ ఏరియాలో ప్రారంభించారు. పవన్ కూడా క్లీన్ షేవ్ చేసుకోవడంతో రెగ్యులర్ షూటింగ్ని మొదలుపెట్టినట్టు తెలిసింది.
పిరిమాడిక్ నేపథ్యంలో మొఘలాయిల కాలం నేపథ్యంలో సాగునుర్న ఈ చిత్రం కోసం భారీ సెట్స్ అవసరం అని, అందు కోసం ఇప్పటికే తాజ్ మహల్, చార్మినార్ సెట్లని నిర్మిస్తున్న క్రిష్ కీలకమైన వాటర్ ఫాల్ సెట్ని కూడా ప్రారంభించినట్టు ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఏ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.