పవర్స్టార్ పవన్కల్యాణ్ హీరోగా ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. మరో సినిమా సెట్స్పైకి రావాల్సి వుంది. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా రీమేక్ అవుతున్న చిత్రం `వకీల్సాబ్`. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్రాజుతో కలిసి బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇటీవలే పవన్ ఈ మూవీ షూటింగ్లో ఎంటరయ్యారు.
ఈ మూవీతో పాటు పవన్ పాన్ ఇండియా స్థాయిలో క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మొఘల్ సామ్రాజ్య కాలంలో కోహినూర్ వజ్రం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ తిరిగి ప్రారంభం కావాల్సి వుంది. ఇదిలా వుంటే పీఎస్పీకే 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ స్క్రిప్ట్లో దర్శకుడు మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం `వకీల్ సాబ్`లో నటిస్తున్న పవన్ ఆ తరువాత క్రిష్ మూవీ కాకుండా మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్లో నటించబోతున్నాడు. ఈ టైమ్లో క్రిష్ పీఎస్పీకే 27 కి సంబంధించిన స్క్రిప్ట్ రీ వ్రైట్ చేయబోతున్నారట. ఈ లోపు మలయాళ హిట్ ని పూర్తి చేయబోతున్నారట.