Homeటాప్ స్టోరీస్పీఎస్‌పీకే 27 స్క్రిప్ట్ లో మార్పులు?

పీఎస్‌పీకే 27 స్క్రిప్ట్ లో మార్పులు?

పీఎస్‌పీకే 27 స్క్రిప్ట్ లో మార్పులు?
పీఎస్‌పీకే 27 స్క్రిప్ట్ లో మార్పులు?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా ప్ర‌స్తుతం రెండు చిత్రాల్లో న‌టిస్తున్నారు. మ‌రో సినిమా సెట్స్‌పైకి రావాల్సి వుంది.  బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా రీమేక్ అవుతున్న చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇటీవ‌లే ప‌వ‌న్ ఈ మూవీ షూటింగ్‌లో ఎంట‌ర‌య్యారు.

ఈ మూవీతో పాటు ప‌వ‌న్ పాన్ ఇండియా  స్థాయిలో క్రిష్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని మొఘ‌ల్ సామ్రాజ్య కాలంలో కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ తిరిగి ప్రారంభం కావాల్సి వుంది. ఇదిలా వుంటే పీఎస్‌పీకే 27వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ స్క్రిప్ట్‌లో ద‌ర్శ‌కుడు మార్పులు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

ప్ర‌స్తుతం `వ‌కీల్ సాబ్‌`లో న‌టిస్తున్న ప‌వ‌న్ ఆ త‌రువాత క్రిష్ మూవీ కాకుండా మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` రీమేక్‌లో న‌టించ‌బోతున్నాడు. ఈ టైమ్‌లో క్రిష్ ‌పీఎస్‌పీకే 27 కి సంబంధించిన స్క్రిప్ట్ రీ వ్రైట్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ లోపు మ‌ల‌యాళ హిట్ ని పూర్తి చేయ‌బోతున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All