Homeటాప్ స్టోరీస్ఈ లాక్ డౌన్ లో కొరటాల ఏం చేస్తున్నట్లు?

ఈ లాక్ డౌన్ లో కొరటాల ఏం చేస్తున్నట్లు?

ఈ లాక్ డౌన్ లో కొరటాల ఏం చేస్తున్నట్లు?
ఈ లాక్ డౌన్ లో కొరటాల ఏం చేస్తున్నట్లు?

ఎప్పుడూ లేని విధంగా కొరటాల శివ కెరీర్ లో భారీ గ్యాప్ వచ్చింది. 2018లో భరత్ అనే నేను చిత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకూ మరో సినిమాను విడుదల చేయలేదు శివ. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవితో ఆచార్య చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టినా కానీ అది మధ్యలోనే కరోనా వల్ల ఆగిపోయింది. దాదాపు మూడున్నర నెలల నుండి షూటింగ్ జరగట్లేదు. మరో రెండు నెలల పాటు జరిగే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో కొరటాల శివ ఏం చేస్తున్నారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

తాజా సమాచారం ప్రకారం మైత్రి మూవీస్ ప్రొడక్షన్ హౌజ్ లో స్క్రిప్ట్ అడ్వైసర్ గా కొరటాల శివ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యానర్ లో కొరటాల శివ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలు చేసాడు. ఇటీవలే పరశురామ్ తో మహేష్ ప్రాజెక్ట్ ను ఈ బ్యానర్ లో సెట్ చేయడంలో కూడా కొరటాల కీలక పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇక ఇప్పుడు దర్శకుడు బాబీ, మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ఆ స్క్రిప్ట్ ను కూడా కొరటాల పర్యవేక్షణలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. తన సూచనలు, సలహాలు ఈ ప్రాజెక్ట్ కు ఇస్తున్నాడట. మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో కొరటాల ఆస్థాన దర్శకుడు అయిపోయాడన్నమాటే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All