ప్రపంచాన్ని కరోనా వైరస్ ఓ కుదుపు కుదిపేస్తోంది. ఏడు నెల లైనా ఇప్పటికి కంట్రల్ లోకి రాలేదు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మాత్రం వరుస పెళ్లిళ్ల హంగామా నడుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు, నిఖిల్, నితిన్, రానా, కాజల్ అగర్వాల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మెగా డాటర్ కొణిదెల నిహారిక కూడా ఇదే జాబితాలో చేరబోతోంది. గుంటూరు కు చెందిన జొన్నలగడ్డ చైతన్య తో. నిహారిక వివాహం జరగబోతోంది.
గుంటూరు ఐజీ తనయుడు జొన్నలగడ్డ చైతన్యతో గత రెండు నెలల క్రితం నిహారిక ఎంగేజ్మెంట్ జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రమే నిశ్చితార్థం జరిగింది. పెళ్లి డిసెంబర్ లో ఉంటుందని నాగబాబు వెల్లడించారు. కానీ పెళ్లి ముహూర్తం ఎప్పుడన్నది వెల్లడించలేదు. తాజాగా పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ముందుగా నాగబాబు చెప్పినట్టే డిసెంబర్ లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు.
డిసెంబర్ 9 సాయంత్రం 7:15 నిమిషాలకు నిహహారిక పెళ్లి ముహూర్తం ఫైనల్ చేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగనున్న ఈ వివాహ వేడుక రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ఉదయ్ విలాస్ లో జరగనుందని జొన్నలగడ్డ చైతన్య ఫాదర్ ఐజి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు వెల్లడించారు. గత కొంత కాలంగా జొన్నలగడ్డ ప్రభాకర్ రావు మెగా ఫ్యామిలీకి ఫామిలీ ఫ్రెండ్ అని తెలిసింది.
- Advertisement -