కోన వెంకట్… కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లకు ఈ పేరు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. శ్రీను వైట్ల – కోన వెంకట్ కాంబినేషన్లో వరుస బ్లాక్ బస్టర్లు వచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు కోన వెంకట్ ఓ నిర్మాత. `తోకలేని పిట్ట` సినిమాతో అన్నీ పోగొట్టుకుని రోడ్డున పడ్డ కోన వెంకట్కు ముంబైలో తన వద్ద ఆశ్రయం ఇచ్చాడట వర్మ.
ఆ తరువాత వర్మ చేసిన చాలా సినిమాలకు ఎగ్జిక్యుటివ్ నిర్మాతగా, రైటర్గా కోన వెంకట్ పనిచేసినట్టు తెలిసింది. జేడీ చక్రవర్తి నటించిన `సత్య` సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటని పక్కన పెట్టి కోన వెంకట్ రాసిన `పెగ్గు మీద పెగ్గు కొట్టు…మామ కల్లు మామ. అంటూ సాగే పాటని పెట్టారట. అంతగా కోన వెంకట్కు ఆర్జీవీ ప్రియారిటీ ఇచ్చారన్నట్టు.
అలాంటి ఆర్జీవీ రైటర్ కోన వెంకట్ని ఏడిపించారట. ఇద్దరికీ మధ్య సాలరీ విషయంలో గొడవ రావడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిసింది. తనని సాలరీ ఇమ్మని అడిగితే వర్మ ఇప్పటి వరకు నీవల్ల నాకు, నా కంపెనీకి ఎన్నికోట్లు లాభం వచ్చిందో కాగితంపై లెక్కరాసి చూపించమన్నాడట. ఆ మాట అన్నాక కోన వెంకట్కు కన్నీళ్లు ఆగలేదట. ఇన్నాళ్లు స్నేహితుడు అనుకుని పనిచేస్తే తనకు దక్కిన ఫలితం ఇదా అని ఆవేదన చెందాడట. ఇంత అవమానం జరిగాక ఇక ఇక్కడ వుండకూడదని టాలీవుడ్కు వచ్చేశాడట. ఈ విషయాన్ని కోన వెంకట్ లో మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడం వైరల్గా మారింది.