`రాజా వారు రాణి వారు` సినిమాతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. తొలి ప్రయత్నలోనే విభిన్నమైన ప్రేమకథతో ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలని ప్రకటించాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం `సెబాస్టియన్ పిసీ 524`. ఈ మూవీ లాంఛనంగా బుధవారం ప్రారంభమైంది. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే ఆయన నటిస్తున్న `ఎస్ ఆర్ కల్యాణమండపం`చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులోని రెండు పాటలు ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ పొందాయి. కిరణ్ అబ్బవరం నటిస్తున్న మరో రెండు చిత్రాలు కల్యాణమండపం, Est. 1975 చిత్రీకరణ దశలో వున్నాయి. బుధవారం మదనపల్లిలోని సొసైటి కాలనీ రామాలయ మండపంలో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం `సెబాస్టియన్ పిసీ 524` పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది.
రేచీకటి నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. నమ్రత దరేకర్, కోమలీ ప్రసాద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేసి చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.