కరోనా మహమ్మారి కారణంగా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితం లభిస్తుందనే భయంతో `లక్ష్మీ` వంటి భారీ చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ని వాయిదా వేసి ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. బాలీవుడ్లో థియేటర్లు రీఓపెన్ అయ్యాయి. దీంతో తొలి చిత్రంగా కియారా అద్వానీ నటించిన `ఇందూ కి జవానీ` చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేశారు.
కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే ప్రజల్లో ఇంకా కరోనా భయం పోకపోవడం.. ఇప్పటికీ ఈ మహమ్మారి స్వైర విహారం చేస్తుండటంతో ఈ మూవీ కోసం థియేటర్లకు రావడానికి ఎవరూ ఆసక్తిని చూపించలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచి భారీ మూల్యం చెల్లించింది.
`ఇందూ కి జవానీ` ఇండియాతో పాటు విదేశాల్లోనూ భారీ స్థాయిలో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టడంలో విఫలమైంది. హాలీవుడ్ యాక్షన్ చిత్రం `టెనెట్` గత వారాంతంలో విడుదలై మల్టీప్లెక్స్లలో మంచి వసూళ్లని సాధించింది. దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే భారీ చిత్రాల వల్లే ప్రేక్షకుల్ని అనుకున్న స్థాయిలో ధియేటర్లని రప్పించవచ్చని తెలుస్తోంది. మరి నిర్మాతలు మాత్రం భారీ చిత్రాల్ని ధియేటర్లలో రిలీజ్ చేయడానికి జంకుతున్నారు.