దేశ వ్యాప్తంగా అన్లాక్ ప్రక్రియ మొదలైంది. అన్ని రంగాల్లో చిన్న చిన్నగా పుంజుకోవడం మొదలుపెట్టాయి. సినిమా షూటింగ్లు కూడా మొదలయ్యాయి. అయితే కరోనా మాత్రం కట్టడి కావడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రముఖులకు కరోనా సోకుతూనే వుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రితిసనన్కు కరోనా సోకింది.
క్రితి సనన్ ప్రస్తుతం రాజ్కుమార్ రావు తోకలిసి ఓ మూవీ చేస్తోంది. గత వారం వరకు ఈ మూవీ షూటింగ్ చంఢీఘడ్లో జరిగింది. షూటింగ్ తరువాత తిరిగి ముంబై తిరిగొచ్చిన క్రితిసనన్కు కరోనా సోకందని తెలిసింది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు క్రితి సనన్ స్పందించడం లేదు. క్రితికి కరోనా పాజిటివ్ అని తేలినట్టు బాలీవుడ్ కు చెందిన వైరల్ భయాని ఓ వార్తని పోస్ట్ చేశారు.
దీంతో క్రితి సనన్కు కోవిడ్ పాజిటివ్ అని తేలినట్టు వార్తలు షికారు చేయడం మొదలైంది. తన ఆరోగ్య పరిస్థితిపై ఊహాగానాలు వస్తున్నా వీటిని క్రితి ఖండించలేదు. దీంతో వైరల్ భయాని ట్వీట్ నిజమనే తెలుస్తోంది.