బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చాలా తక్కువ సమయంలోనే నిలిచింది కియారా. ప్రస్తుతం హిందీ సినిమాల్లో టాప్ రేంజ్ అంటే ఈమెదే. బోలెడంత క్రేజ్ ఈమె సొంతం. కియారా అద్వానీ ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె త్వరలోనే అదిరిపోయే అప్డేట్ తో మన ముందుకు వస్తుందట.
కియారా 7 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపింది. మీ అందరి సపోర్ట్ వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నాను అని తెలిపింది. 2014లో ఫగ్లీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఆమెకు ఫేమ్ తీసుకొచ్చింది మాత్రం ఎమ్మెస్ ధోని చిత్రమే.
తెలుగులో కియారా చేసిన భరత్ అనే నేను చిత్రం కూడా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ కియారాను టాప్ రేంజ్ కు తీసుకెళ్లింది. లస్ట్ స్టోరీస్ వెబ్ ఫిలిం కూడా ఆమెకు బోలెడంత క్రేజ్ ను తెచ్చింది.