Homeటాప్ స్టోరీస్టాకీ పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఖిలాడీ

టాకీ పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఖిలాడీ

టాకీ పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఖిలాడీ
టాకీ పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఖిలాడీ

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా ఖిలాడీ. రవితేజ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ చిత్రం షూటింగ్ గురించి తాజాగా అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు. ఖిలాడీ టాకీ పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇంకా రెండు పాటలను చిత్రీకరించాల్సి ఉందని తెలిపారు.

త్వరలోనే ఈ రెండు పాటలను కూడా చిత్రీకరించి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేస్తామని అప్డేట్ ఇచ్చారు. రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రీకరించాల్సిన రెండు పాటలు కూడా హీరో, హీరోయిన్లపై ఉంటాయని సమాచారం.

- Advertisement -

ఖిలాడీలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడు. సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీంతో పాటు పెన్ స్టూడియోస్ సంస్థ సహ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఖిలాడీ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తికావాల్సింది. నిజానికి మే 2021లోనే ఖిలాడీ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేసారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఖిలాడీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. క్రాక్ తర్వాత విడుదల కానున్న రవితేజ చిత్రం కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All