సైలెంట్గా వచ్చి ఇండియా వ్యాప్తంగా బాక్సీఫీస్ని షేక్ చేసిన చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1`. మాస్ హీరోగా ఫాలోయింగ్ వున్నా భారీ స్థాయిలో మాత్రం యష్కు అప్పటి వరకు పెద్దగా పేరు లేదు. కానీ `కేజీఎఫ్ చాప్టర్ 1` బ్లాక్ బస్టర్ హిట్తో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. యష్ ఏకంగా పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. బడా నిర్మాతల పాలిట కాసుల వర్షం కురిపించే హీరోగా అవతరించాడు. ఈ మూవీకి కొనసాగింపుగా ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 2`.
20 శాతం మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. బ్యాలెన్స్గా వున్న షూటింగ్ కరోనా కారణంగా గత ఐదు నెలలుగా ఆగిపోయింది. ఇటీవల షూటింగ్లకు అనుమతులు లభించడంతో తిరిగి షూటింగ్ని మొదలుపెట్టాలని, బ్యాలెన్స్గా వున్న 20 శాతం షూటింగ్ని పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే వర్క్ మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ షూటింగ్ని ఈ నెల 26 నుంచి మొదలుపెట్టబోతున్నట్టు చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత కార్తిక్ గౌడ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇందులో మెయిన్ విలన్గా బాలీవుడ్ బ్యాడ్మెన్ సంజయ్దత్ అధీరాగా కనిపించబోతున్నారు. సంజయ్, యష్ల మధ్య వచ్చే సన్నివేశాలు రోమాంచితంగా వుండనున్నాయని తెలిసింది. అయితే తాజాగా సంజయ్ దత్ గంతు క్యాన్సర్కు గురికావడం, చికిత్స కోసం ఆసుపత్రిలో చేరడంతో ఈ మూవీ షూటింగ్ కష్టమనే సంకేతాలు మొదలయ్యాయి. అయితే సంజయ్కి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని, డబ్బింగ్ మాత్రమే మిగిలి వుందని చెబుతున్నారు.