కన్నడ హీరో యష్ నటించిన సంచలన చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1`. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రికార్డు యష్ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. రెట్రో యాక్షన్ చిత్రాల్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారతీయ చిత్రాలు హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తీసిపోవని నిరూపించింది. తొలి భాగం దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే.
`కేజీఎఫ్ చాప్టర్ 2` పేరుతో సీక్వెల్ని రూపొందిస్తున్నారు. 20 శాతం మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. బ్యాలెన్స్ షూటింగ్ ని పూర్తి చేసి చిత్రాన్ని అక్టోబర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే త్వరలో షూటింగ్ ప్రారంభించి పూర్తి చేయాలనుకున్న చిత్ర బృందానికి సంజయ్దత్ షాకిచ్చారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ అధీరాగా కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఆయనపై పలు కీలక ఘట్టాల్ని చిత్రీకరించారు. ఇదిలా వుంటే సంజయ్దత్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు క్యాన్సర్లో బాధపడుతున్నట్టు, స్టేజ్ 3కి చేరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రిలో చేరిన సంజయ్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం షూటింగ్స్ నుంచి కొంత విరామం తీసుకుంటున్నాను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నాకు సపోర్ట్గా వున్నారు. నా మేలు కోరే శ్రేయోభిలాషులు భయపడాల్సిన పని లేదు. పుకార్లని పట్టించుకోకండి .మీ ప్రేమాభిమానాలతతో త్వరలోనే కోలుకుని తిరిగి వస్తాను` అని సంజయ్ దత్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే సంజయ్దత్ ట్రీట్మెంట్ కారణంగా `కేజీఎఫ్ 2` మరింత ఆస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.