సైలెంట్గా వచ్చి మోన్స్టర్ హిట్ని సొంతం చేసుకున్న చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1`. దర్శకుడు ప్రశాంత్ నీల్ కిది రెండవ చిత్రం మాత్రమే. రెండవ సినిమాతో సంచలన విజయాన్ని సాధించి హీరో యష్ని పాన్ ఇండియా స్టార్ని చేశారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ సంచలనం సృష్టించింది.
దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని సాధించిన ఈ చిత్రం పలు అవార్డుల్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్గా ప్రస్తుతం `కేజీఎఫ్ చాప్టర్ 2` తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలి భాగం హ్యూజ్ హిట్ కావడంతో సీక్వెల్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్ర హిందీ వెర్షన్ని ఫర్హాన్ అక్తర్, అనిల్ తడాని ఎక్సెల్ మీడియా, ఏఏ ఫిల్మ్స్ బ్యానర్స్పై రిలీజ్ చేస్తున్నారు.
ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని భారీ మొత్తానికి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్టు తెలిసింది. 55 కోట్లుకు ఈ చిత్ర డిజిటల్ రైట్స్కు సొంతం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే మూడొంతులు చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్ర బ్యాలెన్స్ షూటింగ్ ని లాక్డౌన్ తరువాత ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్లో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో రవీనా టాండన్, సంజయ్దత్, రావు రమేష్, అనంత్నాగ్, శ్రీనిధిశెట్టి నటిస్తున్నారు.