సైలెంట్గా వచ్చి మోన్స్టర్గా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1`. యష్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్గా భారీ వసూళ్లని సాధించింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న `కేజీఎఫ్ చాప్టర్ 2`పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్నటి వరకు జరిగిన షూటింగ్తో 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో హైదరాబాద్లో కీలక షెడ్యూల్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. అదే సమయంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో సినిమా షూటింగ్లన్నీ తాత్కాలికంగా ఆగిపోయాయి. అదే జాబితాలో `కేజీఎఫ్ 2` షూటింగ్ కూడా ఆగింది. ముందు అనుకున్న ప్రకారం ఈ చిత్రాన్ని అక్టోబర్లో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రిలీజ్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం మొదలైంది.
ఈ ప్రచారంపై సహ నిర్మాత కార్తీక్ గౌడ స్పందించారు. జూలైలో షూటింగ్స్ అనుమతిస్తే ముందు ప్రకటించిన తేదీనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని, రెండు పోరాట ఘట్టాలు మినహా చిత్రీకరణ దాదాపుగా పూర్తయిందని, లాక్డౌన్ లేకుంటే ఇప్పటికే సినిమా పూర్తయ్యేదని, కేఊలం 20 రోజులు మాత్రమే చిత్రీకరణ మిగిలి వుందని, ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యామని వెల్లడించారు.